ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రెండోసారి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కొవిడ్ సహా పలు కీలక అంశాలపై జగన్ చర్చించినట్లు సమాచారం.
మరోవైపు, ఈ రోజు ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో జగన్ భేటీ అయ్యారు. పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై ఆయన దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి కూడా ఉన్నారు.ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని వారు కోరారు.