సాక్షి మీడియాపై బుద్ధా వెంకన్న మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జనాలను నమ్మించాలని ప్రయత్నించిన తప్పుడు సాక్షి అడ్డంగా బుక్కైందని చెప్పారు. దొంగ వార్తలతో ఏకంగా వైసీపీ నేతలనే బురిడీ కొట్టించింద న్నారు. అదొక విషపత్రిక అనే విషయాన్ని మరోసారి నిరూపించుకుందని అన్నారు.
2017 నవంబర్ 14న కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా భారత్ నెట్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రాల ఐటీ మంత్రులతో సమావేశాన్ని నిర్వహించాయని తెలిపారు.
ఆ సమావేశానికి వెళ్లి ఎంఓయూ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అప్పటి ఐటీ సెక్రటరీ విజయానంద్ నాటి మంత్రి నారా లోకేశ్ ను కోరారని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి లోకేశ్ ఇచ్చిన అనుమతిని సాక్షి మీడియా రూ. 2 వేల కోట్ల అవినీతిగా మార్చిందని మండిపడ్డారు.