ఇళ్ల స్థలాల విషయంలో ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అవినీతికి పాల్పడ్డారని విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జరిగిన వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.బీసీ కార్డును అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుల రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.
మాజీ మంత్రి పితాని కుమారుడు కుంభకోణానికి పాల్పడ్డారని, ఆ కుంభకోణానికి, తండ్రికి సంబంధం లేదని అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. శ్రీరంగనాథరాజుపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి ఆరోపణలు చేశారు.
సచివాలయం కట్టడం కాదు పేదలకు ఇల్లు కావాలి.. కేసీఆర్ పై భట్టి ఆగ్రహం