telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శ్రీవారి భక్తులకు షాక్‌..

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా.. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్‌ ఇచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించిన టీటీడీ.. ఆర్జిత సేవల విషయంలో భక్తులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని తొలుత నిర్ణయించిన టీటీడీ.. ఇప్పుడు వెనక్కి తగ్గింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ పేర్కొంది.

Related posts