లెజెండరీ సింగర్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 11న ఆసుపత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందజేస్తున్నారు. బాలు ఆరోగ్యంపై ఆయన తనయుడు ప్రతిరోజు సమాచారం అందిస్తూ ఉన్నారు. తాజాగా బాలుకు కరోనా నెగిటివ్ అని నిర్దారణ అయ్యింది. బాలు కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన కోలుకోవాలని సెలబ్రెటీలు, సంగీత ప్రేమికులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీత ప్రేమికులు, ఆయనను అభిమానించేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఎస్పీ బాలు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
previous post
next post