ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా ప్రచార రథాలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కరోనాపై అవగాహన కోసం ప్రచార రథాలను ప్రారంభించడం సంతోషకరం అన్నారు. ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలను కూడా కోల్పోయారని, కరోనా నివారణపై అవగాహన కోసం ఈ రథాలు పనిచేయనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే సైబర్ క్రైమ్, ట్రాఫిక్పై ఎప్పటికప్పుడు ఈ వాహనాల ద్వారా సమాచారం ఇస్తారని మంత్రి వివరించారు. ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ప్రజల రక్షణ కోసం చేస్తున్నారని పోలీసులను మంత్రి అభినందించారు.
ఇసుక విధానంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి: పురంధేశ్వరి