telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఒకేసారి అన్ని విద్యాసంస్థలు ఓపెన్ చేస్తే సమస్యలు: సోము వీర్రాజు

Somu Veerraju BJP

ఏపీలో విద్యాసంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఒకేసారి స్కూళ్లు ప్రారంభించడం వల్ల సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. అన్ని విద్యాసంస్థలు ఒకేసారి ప్రారంభిస్తే పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలుస్తారని, దాంతో కరోనా వ్యాప్తి మరింత అధికమవుతుందన్నారు.

విద్యార్థుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా విస్తరించే ప్రమాదం ఉందని సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాతే విద్యాసంస్థలు దశలవారీగా తెరవాలని సూచించారు. ముందుగా కాలేజీలు, ఆ తర్వాత జూనియర్ కళాశాలలు, ఆపై పాఠశాలలు విడతల వారీగా ప్రారంభించాలని తెలిపారు.

Related posts