సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం ముంబైలో యువ నటుడు సమీర్ శర్మ ఆత్మహత్య వార్త విన్నాం. అందులో నుంచి తేరుకోకముందే మరో సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) ఆత్మహత్య వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో భోజ్పురి నటి అనుపమ పాథక్ ఆగస్టు 2న తన దాహిసర్ ఈస్ట్ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారనే వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాధమిక విచారణలో భాగంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి.. ఇప్పుడు ఆ కేసుని ఐపిసి సెక్షన్ 306కి (ఆత్మహత్య కేసుగా) మార్చారు. కాగా తన మరణానికి ఒకరోజు ముందు సామాజిక మాధ్యమాల్లో అనుపమ పాథక్ పెట్టిన ఓ పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది. ”అందరికీ విశ్వాస పాత్రులుగా ఉండండి కానీ.. ఎవరినీ నమ్మకండి. అదే చేసి నేను మోసపోయాను.. ఇది నా జీవితంలో నేర్చుకున్న పాఠం. ప్రజలు చాలా స్వార్థపరులు ఇతరులను పట్టించుకోరు” అని పేర్కొంటూ మరణానికి ముందు రోజు ఆమె ఆవేదన చెందింది.
వాళ్ళను చూసి ఆడవాళ్లు చెడిపోతున్నారు : శ్రీరెడ్డి