telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మహిళా జట్టుది.. అదే పరిస్థితి…

Team India won by New Zealand

గురువారం హమిల్టన్ వేదికగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌లో అబ్బాయిలు తక్కువ స్కోరుకి ఆలౌట్ కాగా, అదే వేదికగా నేడు జరిగిన అమ్మాయిల మ్యాచ్‌లో స్వల్ప స్కోరు నమోదైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత మహిళల జట్టు కివీస్‌తో మూడో వన్డేలో తలపడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్‌.. భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. రెండో వన్డేలో అజేయ అర్ధ సెంచరీలు చేసిన మందన, మిథాలీ రాజ్‌లు తక్కువ స్కోరుకే వెనుదిరగగా, మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

భారత మహిళల జట్టు 44 ఓవర్లలో 149 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శర్మ ( 52; 90 బంతుల్లో, 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్స్‌లో పీటర్సన్ నాలుగు వికెట్స్ తీయగా, తహుహు 3 వికెట్లు, కెర్ 2 వికెట్లు, కాస్పెరెక్ ఒక వికెట్ తీసారు. మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే కివీస్ గడ్డపై సిరీస్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Related posts