ఇటీవలే యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణానికి పాల్పడ్డ విషయం మరవకముందే మరో యువ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరాఠీ నటుడు అశుతోష్ భక్రే (32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహారాష్ట్ర నాందెడ్లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అశుతోష్ భక్రే. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే ఆయన ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అశుతోష్ భక్రే సన్నిహితులు భావిస్తున్నారు. ఈ యువ నటుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు అనుమానాస్పద మృతి కింద దర్యాప్తు చేపడుతున్నారు. అశుతోష్ భక్రే ”భకార్, ఇచర్ థార్లా” లాంటి మరాఠీ సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన భార్య, నటి మయూరి దేశ్ ముఖ్ ‘ఖుల్తా కాళీ ఖులేనా’ అనే సీరియల్ ద్వారా పేరు సంపాదించుకున్నారు. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.
previous post
next post