ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఫలితాలు ఈరోజు వచ్చాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయాం. మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో కరోనాను జయించిన బండ్ల గణేష్ రాజమౌళికి ధైర్యం చెబుతూ ట్వీట్ పెట్టి అందరినీ ఆకర్షించారు. ”ఏమీ కాదు.. సంతోషంగా, హాయిగా ఉండండి సార్. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి” అని ట్యాగ్ చేశారు బండ్ల గణేష్.
@ssrajamouli Nothing will happen be happy Sir eat eggs every day take rest be happy & good Sleep https://t.co/04yHjvGXjL
— BANDLA GANESH. (@ganeshbandla) July 29, 2020
ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారో చర్చిద్దామా? : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు