విరసం నేత వరవరరావు పై ప్రభుత్వం దయచూపాలని వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి కోరారు. వరవరరావును కాపాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో వరవరరావుతో తనకున్న అనుబంధాన్ని లేఖలో పేర్కొన్నారు.
81 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయచూపాలని కోరారు. 53 సంవత్సరాలుగా అడవుల్లో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవాన్ని, మంచం పట్టిన వృద్ధుడు సాధించగలడా అని ప్రశ్నించారు. ఈ స్థితిలో ఆయనను ఇంకా నిర్బంధంలో ఉంచటం అవసరమా అని ప్రశ్నించారు. వరవరరావు విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని కరుణాకర్రెడ్డి కోరారు.
ఏపీ సీఎం పై జేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…