గత పది రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. సంక్షోభ సమయంలో ధరల పెంపు తప్పుడు నిర్ణయమని అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు.
దేశంలో కరోనా వల్ల తలెత్తిన సంక్షోభంతో బాధపడుతోన్న ప్రజలపై మరింత భారం వేసేలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నారని ఆమె అన్నారు. ఈ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. బాధల్లో ఉన్న ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టకూడదని సోనియా గాంధీ లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రజలపై అధిక ధరల భారం మోపి లాభం పొందాలని చూడడం సహేతుకం కాదని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణపై ఏపీలో జగన్ వైఖరి తెలపాలి: మాజీ ఎంపీ హర్షకుమార్