బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. రెండు రోజుల్లో కోస్తాంధ్ర, సీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. తూర్పు విదర్భలో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 8న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం వెల్లడించింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వచ్చే మూడ్రోజుల్లో కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది.