అధికారంలోకి రాగానే అమరావతి విచ్ఛిన్నానికి సీఎం జగన్ పునాది వేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.తన వ్యక్తిగత స్వార్థం కోసం దేశంలో ఎక్కడాలేని మూడు రాజధానుల ప్రతిపాదనను ఏపీ ముఖ్యమంత్రి తీసుకువచ్చారన్నారు.
తన స్వార్థంకోసం. రైతుల ఆందోళనలను పట్టించుకోవడం లేదన్నారు. అయినా రాజధాని అమరావతిని కాపాడుకుంటామని, ఇందుకోసం రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రత్తిపాటి పేర్కొన్నారు.