telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హరీష్ రావు తన పేరును అరిచే రావుగా మార్చుకోవాలి

dk-aruna

దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. నేడు ప్రెస్‌మీట్ నిర్వహించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కేంద్ర నిధులపై సీఎం కేసీఆర్‌తో చర్చకు బండి సంజయ్ వస్తారని మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. కేంద్ర నిధులపై ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు స్పష్టత లేకపోవటం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. హరీష్ రావు తన పేరును అరిచే రావుగా మార్చుకోవాలని సూచించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో హరీష్ రావు చెప్పాలన్నారు. ఓటమి భయంతో హరీశ్‌రావు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారం, డబ్బు బలంతో గెలవాలని చూస్తుందని డీకే అరుణ తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు. ఇది ఇలా ఉండగా..మంత్రి హరీష్ రావు బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. ముత్యం రెడ్డి ఉన్నప్పుడు 30 వేలు ఇస్తేనే గాని ట్రాన్స్ఫార్మర్ లు ఇచ్చేవారు కాదని…ప్రతి పక్షాలకు అభివృద్ధి అంటే అర్థం తెలియదన్నారు. దుబ్బాక లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎగిరిగేరి పడుతున్నారని..ఉత్తమ్, బండి సంజయ్ కి దుబ్బాక ఎల్లలు తెలుసా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పింఛను విషయం లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని..నేను చేసిన రాజీనామా సవాలుకి నోట మాట రావడం లేదని ఫైర్ అయ్యారు. గట్టిగా చెపితే అబద్దం నిజం అవుతుందా..బిజెపీ సోషల్ మీడియాలో అవాస్తవాలు , మాయ మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. 

Related posts