వైసీపీ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. స్వార్థం కోసం అభివృద్ధిని ఆపేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క పైసా ఉపయోగపడని జీరో సీఎం అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ వాళ్లు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనూ వ్యవస్థలన్నింటిని గాడి తప్పించారని విమర్శించారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను చక్కదిద్ది, అభివృద్ధిని పరుగులు పీట్టించమని అన్నారు.
వైసీపీ వాళ్లు తమ స్వార్థం కోసం కావాలనే అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి, పోలవరం పనుల నిలిపివేతే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.”ఏడాది కాలంలో వచ్చిన పరిశ్రమలు శూన్యం, ఉద్యోగాలు సున్నా, రాష్ట్ర ప్రగతీ అంతే. ప్రజల ఆదాయంలో సున్నా, నిర్మాణాలు సున్నా” అంటూ ఎద్దేవా చేశారు. ఉన్న నిర్మాణాలకు పార్టీ రంగులేసి ప్రభుత్వ ఖజానాకు సున్నం వెశారని దుయ్యబట్టారు.