గుజరాత్లోని భరూచ్ జిల్లాలో పేలుడు సంభవించింది. దహేజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఓ కెమికల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. యశస్వి రసాయన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుగల కంపెనీలో జరిగిన ఈ పేలుడులో పలువురు కార్మికులు గాయపడ్డారు.
పేలుడు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పేలుడు కారణం ఏమిటి, మంటల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.