కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా చర్యలను చేపడుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందించింది వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్. ఏక్తా కపూర్ నిర్మించే షోలు, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’, ‘బాబూజీ ఘర్ పర్ హై’ వంటివాటి షూటింగులన్నీ జూన్ చివరి వారం నుంచి ప్రారంభమవుతాయని ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బీ.ఎన్.తివారీ తెలిపారు. ఈ షోల ప్రొడ్యూసర్లు తమ షూటింగులను మొదలుపెట్టవచ్చునని, కానీ కొన్ని షరతులు పాటించవలసి ఉంటుందని ఆయన చెప్పారు. షూటింగ్ లో పాల్గొనే ప్రతి వ్యక్తీ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, నటీనటుల్లో గానీ, షూటింగ్ సిబ్బందిలో గానీ ఎవరైనా కరోనాతో మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించవలసి ఉంటుందని ఆయన అన్నారు. షూట్ సమయంలో సెట్స్ పై 50 శాతం సిబ్బందే ఉండాలని, మిగతా వారిని షిఫ్టుల్లో పని చేసేలా చూడాలని తివారీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ పై అమెరికా మాజీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు…