అఖిల్ అక్కినేని బుధవారం నాడు 26వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ యంగ్ హీరోకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో చై-సమంత ఒక చోట ఉండగా.. అఖిల్, నాగార్జున, అమల మరో చోట ఉన్నారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే సాదాసీదాగా పుట్టినరోజును జరుపుకున్నారు అఖిల్. అయితే చైతన్య, సమంత మాత్రం ఈసారి అఖిల్కు సోషల్ మీడియాలో విషెస్ చెప్పలేదు. ప్రతి ఏడాది తమ సోషల్ మీడియాలో అఖిల్కు విష్ చేస్తూ వస్తోన్న ఈ ఇద్దరు ఈసారి చెప్పకపోవడంపై ఫ్యాన్స్ ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరేమో సోషల్ మీడియాలో చెప్పకపోయినప్పటికీ.. ఫోన్ చేసి చెప్పి ఉండచ్చు కదా అని, ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది… ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని ఎవరూ కోరుకోరు కదా అందుకే విష్ చేయలేదేమో అని కామెంట్స్ చేస్తున్నారు.
previous post
అది నిజజీవితంలో నా తల్లి పాత్ర : సాయి ధరమ్ తేజ్