ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కరోనా కట్టడికి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తనవంతు సాయంగా రామోజీ చెరో రూ.10 కోట్లు చొప్పున రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దమొత్తంలో ఆర్థిక సహాయం అందజేసి తన పెద్దమనసు చాటుకున్నారని అన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను నేరుగా కలిసి నిధులు అందించేందుకు లాక్డౌన్ నిషేధం ఉన్న కారణంగా ఆన్లైన్లో ఈ నిధులను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి బదిలీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమిరెడ్డి ట్విట్టర్లో స్పందించారు. కష్టకాలంలో రామోజీ తన పెద్దమనసు చాటుకున్నారని అభినందనలు తెలియజేశారు.
ఇలా చేస్తే జనాభా నియంత్రణ సాధ్యం: బాబా రాందేవ్