telugu navyamedia
తెలంగాణ వార్తలు

మునుగోడు లో ఎప్పుడు ఎన్నికలు వ‌చ్చినా టీఆర్ఎస్ దే గెలుపు..

మునుగోడులో ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం టీఆర్ఎస్సేదేనంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు .బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్‌కు కంచుకోటని అన్నారు. హుజుర్‌నగర్, నాగార్జునసాగర్ లాగానే మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లేకున్నప్పటికీ అభివృద్ధి ఏమాత్రం ఆగలేదన్నారు. పెన్షన్లు లాంటివి అన్ని పథకాలు ప్రజలకి అందించామన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడపటం.. ప్రజల మన్ననలు పొందడంలో కూడా సీఎం కేసీఆర్ ముందు ఉంటారని అన్నారు.

ఇక బిహార్‌ రాజకీయాలను యావత్‌ దేశం గమనిస్తోందని, బీజేపీ బ్యాక్‌డోర్‌ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం మంచి పద్ధతి కాదన్న కవిత మునుగోడు ఉపఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెబుతుందన్నారు.

Related posts