telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశంలోనే తొలి కోవిడ్ 19 టెస్టింగ్ కిట్ … కిట్ తయారు చేసే సమయంలో ఆమె గర్భిణి

karona

ఇప్పటికే అనేకమంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పూణేకు చెందిన మైలా డిస్కవరీ డయాగ్నస్టిక్ ఫర్మ్ సక్సెస్ సాధించింది. దేశంలోనే తొలి కోవిడ్ 19 టెస్టింగ్ కిట్ డెవలప్ చేసింది. ఈ కిట్ ద్వారా తక్కువ సమయంలోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించవచ్చు. ఇక ఈ కిట్ తయారీ వెనుక ఓ మహిళ శ్రమ, కృషి, పట్టుదల ఉంది.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. కిట్ తయారు చేసే సమయంలో ఆమె గర్భిణి.. కొన్ని గంటల్లో డెలివరీ కావాల్సి ఉన్నా.. దేశం, ప్రజల శ్రేయస్సు కోసం టెస్టింగ్ కిట్ పై ప్రయోగాలు చేశారు.మినల్ ఓ వైరాలజిస్ట్. ఆమె మైల్యాబ్స్ లో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చీఫ్. ఈమె ఆధ్వర్యంలోనే కేవలం ఆరు వారాల్లోనే ఈ కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ డెవలప్ చేయడం విశేషం. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ‘ నేను ఇది ఓ సవాల్‌గా తీసుకున్నాను. ఈ కిట్ దేశానికీ చాలా అవసరం.. ఇలా నా దేశానికీ నేను సేవ చేశానని’ ఆమె తెలిపారు. మా బృందంలో మొత్తం 10 మంది ఉన్నాం. అందరం కూడా ఈ కిట్ తయారీకి తీవ్రంగా శ్రమించాం. ఇక ఈ కిట్ ద్వారా కేవలం రెండున్నర గంటల్లో కరోనా పరీక్షలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. కాగా మైల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ చట్టబద్ధమైన ఆమోదం పొందటంతో రోజుకు 15 వేలకు పైగా కోవిడ్ టెస్టింగ్ కిట్లు తయారు చేస్తున్నారు.

Related posts