విశ్రాంత ఉద్యోగులకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) ద్వారా లబ్ధిపొందుతున్న దీర్ఘకాల వ్యాధులున్న రోగులకు లాక్డౌన్ నేపథ్యంలో మూడు నెలల మందులను ఒకేసారి అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా నగరాల్లోని వెల్నెస్ సెంటర్లకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు సీజీహెచ్ఎస్ వెల్ నెస్ కేంద్రాలను సంప్రదించి మూడు నెలలకు కావాల్సిన మందులను ఒకేసారి పొందవచ్చని వెల్లడించింది.