telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కషాయం తీసుకుంటే మంచిది: మంత్రి పువ్వాడ

puvvada ajay

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ బారినపడకుండా ప్రతి ఒక్కరూ  జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని ఏర్పాటుచేసిన ఉచిత కషాయం, మాస్క్‌ల పంపిణీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరూ భౌతిక దూరం పాటించాలన్నారు.

ప్రభుత్వ సూచ నలను ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని అన్నారు. అందులో భాగంగా ఇలాంటి కషాయం వంటివి కూడా తీసుకుంటే మంచిదన్నారు.

Related posts