కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో వేయి పడకలతో అతిపెద్ద కరోన ఆసుపత్రిని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ప్రత్యేకించి కరోనా రోగుల కోసం భారీ హాస్పిటల్ నిర్మించాలని ఒడిశా నిర్ణయించింది.
మరో పక్షం రోజుల్లో అది అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇదే జరిగితే దేశంలోనే అతిపెద్ద కరోనా దవాఖాన నిర్మించిన ఖ్యాతి ఒడిశాకు దక్కుతుంది. ప్రస్తుతం భారత్లో నిర్దారిత కోరనా కేసుల సంఖ్య 650 దాటింది. కాగా మృతుల సంఖ్య 13 కు చేరుకుంది.
సీఏఏ చట్టం ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి