telugu navyamedia
రాజకీయ వార్తలు

కిరణ్‌బేడీకి మద్రాస్‌ హైకోర్టు షాక్ .. పాలనలో జోక్యం కుదరదని స్పష్టం!

Puducheri Governor Kiranbedi Comments AP

కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీకి మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాలనకు సంబంధించిన రోజువారీ అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం కిరణ్‌బేడీకి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతేగాక.. కీలక విషయాల్లో ఆమె స్వతంత్రంగా వ్యవహరించే అధికారం కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అధికారాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. కిరణ్ బేడీ పుదుచ్చేరి ప్రభుత్వం రోజువారీ పాలనలో జోక్యం చేసుకోవడం కుదరదని మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ స్పష్టం చేసింది.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామికి, లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న కిరణ్ బేడీకి మధ్య అనేకమార్లు అధికారాలకు సంబంధించిన అంశాల్లో విభేదాలు తలెత్తాయి. దానికితోడు, కిరణ్ బేడీ ప్రయివేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాలపై చోటుచేసుకున్న అవినీతి స్కాంలోనూ జోక్యం చేసుకుని కాలేజీల్లో ఫైళ్లను పరిశీలించారు. అప్పటినుంచి కిరణ్ బేడీకి, పుదుచ్చేరి ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగిపోయింది. దీనిపై ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ జరిపింది. పాలనకు సంబంధించి కిరణ్ బేడీ సొంత నిర్ణయాలు తీసుకోరాదని, ఆమె ఇలాంటి విషయాల్లో ఎలాంటి అధికారాలు లేవని తేల్చి చెప్పింది.

Related posts