ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రావడంతో పార్టీల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. సీఎం జగన్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలనపై నమ్మకం లేకే జగన్ అడ్డదారుల్లో పయనిస్తున్నారని ఆరోపించారు.
గంటగంటకు రిజర్వేషన్లలో మార్పులు చేయడం సరికాదని అన్నారు. పోలీసులు నిజాయతీగా పనిచేయాలని, వైసీపీ దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. కడప జిల్లా రాజంపేటలో పెడతామని బెదిరిస్తున్నారని కన్నా ఆరోపించారు.