బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకుంటామని నితీశ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ ట్విటర్ లో ఘాటుగా స్పందించారు. నితీశ్ 15 ఏళ్ల పాలనలో బీహార్ ఇప్పటికీ పేద రాష్ట్రంగా ఉందని మండిపడ్డారు. ఢిల్లీ అల్లర్లలో 46 మంది చనిపోతే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు.
నిరుద్యోగం కారణంగానే బీహార్ యువత రాష్ట్రాన్ని వీడుతోందని ప్రశాంత్ కిశోర్ చేసిన ఆరోపణలపై నితీశ్ కుమార్ స్పందించారు. నిన్న పాట్నాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. దేశం అంతా ఒకటేనని, ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడాన్ని సమస్యగా చూడకూడదని అన్నారు.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.