తనపై ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభం కలుగుతుందని కాంగ్రెస్ నాయకుడు, మల్కజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై అధికార పార్టీ కేసులు పెట్టి వేధించడం సహజమన్నారు. గోపన్నపల్లి భూ ఆక్రమణల ఆరోపణలపై ఆయన ఈరోజు స్పందించారు.
పనిచేయని ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని కేటీఆర్ చెబుతున్నారని, మరి ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్, కేటీఆర్లను ఏం చేయాలని ప్రశ్నించారు. వారు తక్షణం రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ప్రకటనలో అన్ని అబద్ధాలే.. జగన్ పై లోకేశ్ విమర్శలు