ఢిల్లీలోని జేఎన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసి తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కేంద్రం నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. అవసరమైన నష్టనివారణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.
అయితే బాధితుల్లో ముఖ్యమైన వారు వామపక్ష భావజాలం ఉన్న వారు కావడంతో ఇది ఏబీవీపీ విద్యార్థి సంఘం పనే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అమిత్ షా లెఫ్టినెంట్ గవర్నర్ తో ఈ రోజు ఉదయం ఫోన్లో మాట్లాడారు. అవసరమైన సూచనలు చేశారు. ఘటన పై పోలీసులు ప్రాథమిక ఆధారాలతో ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేశారు.
మరోవైపు వర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.జగదీష్ కుమార్ స్పందిస్తూ జరిగిన ఘటన దురదృష్టకరమని, విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో తరగతులు యథావిధిగా సాగుతాయని, వింటర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్ సజావుగా సాగేలా చూస్తామని తెలిపారు.
మాజీ సీఎంలను గృహనిర్బంధం చేయాల్సిన అవసరం ఏంటి? : గులాంనబీ ఆజాద్