రైతులకు బాసటగా నిలిచేందుకు ఈ నెల 12న కాకినాడలో నిరాహారదీక్ష చేపడతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర రైతుల కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడేందుకు పవన్ చేపట్టనున్న దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని మనోహర్ పిలుపు నిచ్చారు.
పవన్ కల్యాణ్ దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. రైతులకు బాసటగా నిలించేందుకు ఒక రోజు దీక్ష చేయాలని పవన్ నిర్ణయించారని అన్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడలో నిరసన దీక్ష చేయనున్నట్టు తెలిపారు. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించడంతో ఏపీలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.