100 రోజులకుపైగా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ హౌస్… కొందరు హౌస్ మేట్స్ మధ్య చిచ్చు కూడా పెట్టింది. బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా శ్రీముఖి, రాహుల్ మధ్య గ్యాప్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అంటూనే ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. తమ గొడవలతో “బిగ్బాస్-3” కార్యక్రమాన్ని రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ శ్రీముఖి వేడెక్కించారు. గతంలో మంచి స్నేహితులైన వీరిద్దరూ బిగ్బాస్ హౌస్లో మాత్రం శతృవులుగా మారిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ షోలో రాహుల్ సిప్లిగంజ్ విజయం సాధించగా, శ్రీముఖి రన్నరప్గా నిలిచింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా వీరు కలిసి కనిపించలేదు. అయితే తాజాగా వీరిద్దరూ కలిశారు. రాహుల్, శ్రీముఖి కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను రాహుల్, శ్రీముఖి తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో షేర్ చేశారు. `గతం గతః.. అసలు రిలేషన్షిప్ ఇప్పుడు మొదలైంది` అంటూ శ్రీముఖి కామెంట్ చేసింది.
View this post on Instagram
ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదు: లక్ష్మీపార్వతి