సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తి రాజకీయాలలోకి రానున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నప్పటికి, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు. కొన్నాళ్ళుగా సస్పెన్స్ పెడుతూ వస్తున్న తలైవా తన పార్టీ గ్రౌండ్ వర్క్ మాత్రం ముమ్మరంగానే జరుపుతున్నట్టు తెలుస్తుంది. సొంత పార్టీ పెడతారని అభిమానులు భావించగా, ఇటీవల తాను కమల్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని రజనీ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన ఓ న్యూస్ తమిళ మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది. సూపర్స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్హాసన్ కలిసి దాదాపు 40 ఏళ్ల తర్వాత వెండితెరపై కలిసి సందడి చేయనున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. త్వరలో రజినీకాంత్, కమల్హాసన్ కలిసి నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కార్తీతో `ఖైదీ` సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయట. రజినీ ప్రస్తుతం `దర్బార్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత దర్శకుడు శివతో కలిసి పనిచేయనున్నారు. కమల్హాసన్ ప్రస్తుతం `భారతీయుడు-2` చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత స్వీయ దర్శకత్వలో ఓ సినిమాను రూపొందించనున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేసే అవకాశముందని తెలుస్తోంది. మరి, ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
previous post