అఖిల్ అక్కినేని నాలుగో చిత్రం షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుందని ఇది వరకే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ల సరసన వరుస సినిమాలు చేస్తున్న పూజా, అఖిల్ లాంటి యంగ్ హీరో సరసన ఎంత వరకు సెట్ అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్లో అఖిల్, పూజా హెగ్డేలు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అఖిల్, పూజా దిగిన సెల్పీ ఫోటో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఫోటోలో వారి జోడి ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోవటంతో విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది నెటిజెన్లు పూజ, అఖిల్కు అక్క లాగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్లో గతంలో పూజాకు ఐరన్ లెగ్ అన్న ముద్ర ఉండేది. దీంతో అఖిల్ మీద కూడా ఆ ప్రాభవం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్లు.
previous post