telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరంపై ప్రస్తావించిన విజయసాయి రెడ్డి.. కేంద్రం సమాధానంతో వైసీపీ షాక్!

Vijayasai reddy ycp

టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతం వరకు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రివర్స్ టెండరింగ్ వేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పోలవరంలో చంద్రబాబు వేల కోట్లు అవినీతి చేసేసారని, పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు ఏటియం గా వాడుకున్నారు అంటూ, రాజకీయ విమర్శలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన అధికారంలోకి రాగానే, ఒక నిపుణుల కమిటీ వేసి, పోలవరంలో జరిగిన అవినీతిని వెలికి తీయాలని కమిటీ కూడా వేశారు.

పోలవరం పై విజయసాయి రెడ్డి రాజ్యసభలో వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వంలో అదనపు చెల్లింపులు జరిపి, అవినీతికి పాల్పడింది అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ నిజమేనా ? దాని పై, కేంద్రం ఏమి చర్యలు తీసుకుంది అంటూ, ప్రశ్నించారు. ఈ క్రమంలో జల శక్తి మంత్రి రతన్ లాల్ కటారియా సమాధానం ఇస్తూ అదనపు చెల్లింపులు చేసింది నిజమే కాని, ఎక్కడా నిబంధనలు అతిక్రమించి, చెల్లింపులు జరగలేదని, ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చెప్పిందని తెలిపారు. కేంద్రం ఇంచ్చిన సమాధానంతో ఒక్కసారిగా వైసీపీ షాక్ అయ్యింది.

Related posts