డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో ‘”జేమ్స్ బాండ్” 25వ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘నో టైమ్ టు డై’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3, 2020న యూకేలో, ఏప్రిల్ 8, 2020న యూఎస్లో సినిమా విడుదల కాబోతున్నట్లు స్పష్టం చేసింది. మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే ఈ చిత్ర కథ ఉండబోతోందని సమాచారం. బాండ్ 25 చిత్రానికి ఆ మధ్య పలు సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. “జేమ్స్ బాండ్ సినిమా : నో టైమ్ టు డై” ట్రైలర్ బుధవారం విడుదల కానుంది. ఇటీవల రిలీజైన 15 సెకన్ల టీజర్లో అన్ని యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. బ్లా షూట్, సన్గ్లాసెస్లో క్రేగ్ స్టయిలిష్గా కనబడుతున్నాడు. ఇక కార్లు, బైక్లతో స్టంట్లు మరింత అదిరిపోయాయి. కారు హెడ్లైట్ నుంచి గన్ బ్యారెల్స్ బయటకు రావడం… యాక్షన్ ప్రియుల్ని థ్రిల్ చేస్తోంది. రామీ మాలిక్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. బుధవారం విడుదలయ్యే ట్రైలర్ కోసం బాండ్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
Bond is back. The first trailer for #NoTimeToDie arrives this Wednesday #Bond25 #BondJamesBond pic.twitter.com/ThIEdXn82N
— James Bond (@007) December 2, 2019
పవన్, లోకేష్ ఓడిపోతారని ముందే తెలుసు… బండ్ల గణేష్ కామెంట్స్