ఒకే రోజు దాదాపు రూ.20 లక్షలు బహుమతిగా రావడంతో గంటల వ్యవధిలో ఓ యువతి లక్షాధికారిగా మారిపోయింది. వివరాల్లోకి వెళితే అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం మెకానిక్స్ విల్లే ప్రాంతానికి చెందిన ఆమె తన బిజినెస్ పార్ట్నర్తో కలిసి మార్కెట్కు వెళ్లింది. ఓ లాటరీ షాప్కు వెళ్లి టిక్కెట్టు కొనుగోలు చేసింది. తన పార్ట్నర్తోనూ ఒక టిక్కెట్టు కొనిపించింది. ఆయాచిత ఆదాయంపై నమ్మకం లేని పార్ట్నర్ ఆమె మాట కాదనలేక టిక్కెట్టు కొన్ని వెంటనే దాన్ని అక్కడే విసిరిపారేశాడు.
అయితే, సదరు యువతి తన కొన్న టిక్కెట్టుతో పాటు స్నేహితుడి టిక్కెట్టును కూడా సేకరించి జాగ్రతపరిచింది. ఆ రెండు టిక్కెట్లకు జాక్పాట్ తగలడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ముందుగా స్నేహితుడు పారేసిన టిక్కెట్టుకు రూ.8.54 లక్షలు (12 వేల డాలర్లు) బహుమతి వచ్చినట్టు తెలియడంతో ఆమె ఆశ్చర్య పోయింది. .అనూహ్యంగా తాను కొన్న టిక్కెట్టుకు మరో రూ.11.40 లక్షలు వచ్చాయని తెలియడంతో ఆమె లక్షాధికారిగా మారింది.
మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారు: అనురాధ