ఏపీలో మద్యం పాలసీపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. ఓవైపు మద్య నిషేధం దిశగా చర్యలు అని చెబుతున్నా, రాష్ట్రంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. మద్యనిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెబుతున్నా వైసీపీ సర్కారు రేట్లు పెంచేసి దోపిడీ కొనసాగిస్తున్నారనిఅన్నారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై ప్రవహిస్తోందని, గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టుషాపులు వెలిశాయని ఆరోపించారు. మద్యపాన నిషేధం కోసం శ్రమిస్తున్నామని ఉపన్యాసాలిస్తున్నారని దుయ్యబట్టారు. బార్ల సంఖ్య తగ్గిస్తున్నాం అని చెప్పి, గతంలో కంటే రేట్లు పెంచి నిలువునా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.