telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో రోజూ 50 వేలకు పైగా కరోనా పరీక్షలు: జగన్

cm jagan ycp

రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 10 లక్షల మందిలో 31 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 90 శాతం పరీక్షలు కొవిడ్ క్లస్టర్లలో జరుగుతున్నాయని వివరించారు.

ఈ రోజు ఆరువేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారని వివరించారు. కానీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ తో కలిసి జీవించక తప్పదని జగన్ అభిప్రాయపడ్డారు.

Related posts