ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలోఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్త కార్తీక్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ సైకో ఇజంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మండిపడ్డారు.
సీంగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మారిందని విమర్శించారు. ఇప్పటికి రెండు వందల నలభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 8 మంది టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి చంపారని ఆరోపించారు. వైసీపీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు అధికారులు కూడా ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు అయితే ఇప్పటికే 43 మంది ఆత్మహత్య చేసుకున్నారని లోకేశ్ దుయ్యబట్టారు.