వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న వారిలో లక్ష్మీపార్వతీ ఒకరు. వైసీపీలో ఉంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్నా నేడు అధికారంలో ఉన్న సమయంలోను పార్టీ లేదా ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను తనదైన శైలిలో తిప్పికొడుతుంటారు. కానీ ఏనాడూ లక్ష్మీపార్వతీ జగన్ ను చిన్న పదవి కూడా కోరలేదు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాడు కాబట్టి లక్ష్మీపార్వతీ కోసం ఒక నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. పదవులు ఆశించకుండానే… వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీకి చెందిన పలువులు కీలక నేతలను ఓ రేంజిలో ఆటాడేసుకున్న లక్ష్మీపార్వతి… టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు విషయంలో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ పార్టీని ఎప్పుడు తన విమర్శలతో ఇరుకున పెట్టే లక్ష్మీపార్వతీ .. జగన్ ప్రభుత్వం కొలువు దీరిన ఇంత వరకు ఏ పదవి రాలేదు. అయితే జగన్ తనను నమ్మినవాళ్లు అడిగినా అడగకున్నా వారిని మరిచిపోయే రకం కాదు.
ఈ క్రమంలోనే లక్ష్మీపార్వతికి ఇప్పుడు ఓ నామినేటెడ్ పదవిని జగన్ కేటాయించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా లక్ష్మీపార్వతికి పట్టుఉన్న రంగానికి చెందిన కీలక బాథ్యతలను జగన్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. జగన్ ఇప్పటికే కొంత మందికి నామినేటెడ్ పదవులను కేటాయించారు. అదే వరుసలో లక్ష్మీపార్వతీకి కూడా నామినేటెడ్ పదవి సిద్ధం అయ్యిందని చెప్పాలి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు పదవిని ఆయన లక్ష్మీపార్వతికి ఇవ్వనున్నారట.
అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమి కాదు: చంద్రబాబు