వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. ఘోర నేరానికి పాల్పడిన నలుగురికి తగిన శిక్ష పడిందని పేర్కొన్నారు.ఆ నలుగురు మానవత్వాన్ని మంట గలిపారని అన్నారు. అలాంటి వాళ్ల విషయంలో మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు.
మున్ముందు ఇలాంటి ఎన్ కౌంటర్లు అవసరంలేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళలు నిర్భీతిగా సంచరించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.