బాలీవుడ్ నటి దీపికా పదుకొణే చపాక్ సినిమాతో నిర్మాతగా మారింది. తన నిర్మాణంలో మహాభారత్ చిత్రాన్ని రెండో సినిమాగా రూపొందించాలని భావిస్తుందట. మధు మంతెనతో కలిసి మహాభారత్ చిత్రాన్ని దీపికా పదుకొణే నిర్మించనుండగా, ఇందులో ద్రౌపది పాత్రలో ఆమె కనిపించనుందట. తన పాత్ర గురించి తెలుసుకున్న దీపికా ఆశ్చర్యపోయిందట. అంతేకాదు ద్రౌపదిపై చాలా గౌరవం పెరిగిందట. తన జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర ఇది అవుతుందని దీపిక అంటుంది. సాంస్కృతిక ధృక్పతాలతో ఇది కూడుకొని ఉంది అని దీపికా ఇంగ్లీష్ మీడియా పత్రికతో చెప్పుకొచ్చింది. మహాభారతం అంటే కేవలం శ్రీకృష్ణుడు, అర్జునుడి గురించే మాట్లాడుకుంటారని, ఈ సినిమా చూశాక కేవలం ద్రౌపది గురించే మాట్లాడుకుంటారని దీపిక తెలిపారు. మహాభారతం ఇతిహాసంలో ఎందరో జీవితాలు ఉన్నాయి. చిత్ర మొదటి భాగం 2021 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మహా ఇతిహాసం మహాభారతం వెండితెరపై చూపించేందుకు ఎందరో ఫిలిం మేకర్స్ కృషి చేస్తున్నారు. మోహన్ లాల్, అమీర్ ఖాన్, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ ప్రాజెక్ట్పై ఎప్పటినుండో కసరత్తులు చేస్తున్నారు.
previous post
next post