సినీ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ల మధ్య ఆర్థిక వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం పై తాజాగా బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో చట్టాన్ని, న్యాయాన్ని డబ్బులిచ్చి కొనలేమని పేర్కొన్న ఆయన.. స్కామ్ రాజా ఆ విషయాన్ని గుర్తించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధర్మమే జయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఒక్కొక్కరికీ ఒక్కో టాలెంట్ ఉంటుందని… ఈ స్కామ్ రాజాకు దొంగ సంతకాలు పెట్టే టాలెంట్ ఉందని ఆరోపించారు. ఆ కళకు ఎందరో స్నేహితులు బలయ్యారని.. ఆఖరికి సొంత అన్న కూడా అంటూ ట్వీట్ చేశారు. పరారీలో ఉన్నారని చెబుతున్న బండ్ల గణేశ్.. తనకు పీవీపీ, ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే రసయయి మరోసారి సంచలన వ్యాఖ్యలు..