యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో “సాహో” చిత్రం స్టోరీ లైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. “సాహో” సినిమా మొత్తం రెండు వేల కోట్ల దొంగతనం చుట్టూనే నడవనుండగా, దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు అశోక్ చక్రవర్తి (ప్రభాస్) రంగంలోకి దిగుతాడట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ పోలీస్గాను, దొంగగాను కనిపిస్తాడట. ఈ రెండు వేరియేషన్స్ని దర్శకుడు చాలా కన్విన్సింగ్గా చూపిస్తాడు. ఇక ప్రభాస్ తండ్రి ఓ శాస్త్రవేత్త కాగా… అతను అధునాతన జెట్ ప్యాక్ను సృష్టిస్తాడని, దొంగతనానికి సంబంధించిన రహస్యాలు ఓ బ్లాక్ బాక్స్లో ఉంటాయని చెబుతుండగా, ఆ రహస్యాన్ని ఎలా చేధించారు అనేది మిగతా సినిమా స్టోరీ అని చెబుతున్నారు. ఫ్లాష్ బ్యాక్లో ప్రభాస్ని అపార్ధం చేసుకున్న శ్రద్ధా తర్వాత అతని ప్రేమలో పడుతుందట. ఇదే సినిమా స్టోరీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బాలయ్య మొనగాడు… చిరంజీవి గిరంజీవి ఎవరూ… : బాబు మోహన్