మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రం విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఈ నెల 14వ తేదీ నుంచి మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ రోజున ఈ సినిమా మేకింగ్ వీడియోను వదలనున్నారు. ఈ నెల 20వ తేదీన ముంబైలో ఒక ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ వేదికపైనే టీజర్ ను రిలీజ్ చేస్తారు. అమితాబ్ .. చిరంజీవి .. విజయ్ సేతుపతితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ అనంతరం చిరంజీవి విదేశాలకి వెళతారట. తన బర్త్ డే వేడుకను ఆయన అక్కడే జరుపుకోనున్నట్టుగా సమాచారం.
next post