భారత్-వెస్టిండీస్ తొలి వన్డే గయానా ప్రొవిడెన్స్ మైదానంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గడంతో పిచ్పై కవర్లను తొలగించగా కాసేపట్లో అంపైర్లు పిచ్ను పరిశీలించి టాస్ వేయనున్నారు.
ఇప్పటికే టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్ వన్డే సిరీస్ను కూడా విక్టరీతో మొదలుపెట్టాలని అనుకుంటుంటే సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్ను గెలవాలని విండీస్ పట్టుదలతో దిగుతుంది. ప్రపంచకప్ తర్వాత కోహ్లీ సేనకు ఇదే తొలి వన్డే మ్యాచ్.