వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగు సీజన్-3… నాగార్జున హోస్ట్గా 15మంది సెలబ్రిటీలతో జూన్ 21న మొదలైన ఈ కార్యక్రమం విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో హేమ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే తమన్నా సింహాద్రి ఓ ట్రాన్స్జెండర్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆమెకు సంబంధించిన చాలా విషయాలు చాలామందికి తెలియవు. ఆమెకు రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ఉంది. ఆమె అసలు పేరు సింహాద్రి మస్తాన్. వీళ్లు హిందువులే. గతంలో సింహాద్రి సత్యనారాయణ అని అవనిగడ్డ నుంచి గెలిచిన టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు దేవుడు మంత్రిగా కూడా పేరుంది. అంటే ఎంతో నిజాయతీ పరుడన్న మాట. తమన్నాకు ఆయన పెదనాన్న అవుతారు. అంటే సత్యనారాయణకు తమన్నా కూతురు వరుస అవుతుంది. ఇక తమన్నా తండ్రి రైతు. మగవాడిగా ఉండడం ఇష్టంలేక ఇళ్లు వదిలి హైదరాబాద్కు వచ్చేసింది. అక్కడ నుంచి ముంబైకు చెక్కేసి ట్రాన్స్జెండర్గా మారిపోయింది. ఇటీవల ఎన్నికల్లో జనసేన నుంచి మంగళగిరిలో పోటీ చేస్తానని నానా రచ్చ చేసింది. చివరకు మంగళగిరిలో లోకేష్ మీద పోటీకి ఇండిపెండెంట్గా దిగింది. ఆమెది కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం… అందుకే మంగళగిరిలో పోటీ చేసింది. చివరకు ఆమెకు వచ్చిన ఓట్లు 45 మాత్రమే వచ్చాయి. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశించి హడావుడి చేసేస్తోంది తమన్నా.
previous post
next post
ఆ బాలీవుడ్ సినిమా చేసినందుకు బాధ పడడం లేదు : పూజాహెగ్డే