telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతుల కుటుంబాలకు పరిహారం..రెవెన్యూ శాఖ ఉత్తర్వులు!

world bank appreciates telangana govt

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయనుంది. ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడితో పంటలు సాగు చేసి దిగుబడిరాక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.2019-20 ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్న 243 రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 6 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రూ. 14.58 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల జారీతో 24 జిల్లాలకు చెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందనుంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 45 రైతు కుటుంబాలకు పరిహారం అందనుంది.

Related posts